4 May, 2026 | 12:27 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

నిందితుడికి 21 ఏండ్ల జైలు

16-09-2025 12:51 AM

-బాలికపై లైంగిక దాడి కేసులో తీర్పు

-బాధితురాలికి రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశం

చిట్యాల, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో 21 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో న్యాయస్థానం ఇన్‌చార్జి జడ్జి రోజా రమణి సంచలన తీర్పును వెల్లడించారు. అ లాగే బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. చిట్యాల మం డలం వనిపాకల గ్రామానికి చెందిన దోమల రాములు తాగిన మైకంలో 2018లో ఎనిమిదేండ్ల బాలిక టీవీ చూస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడి లైంగిక దాడి చేశాడు.

ఈ ఘటనపై బాధితురాలి తండ్రి అదే ఏడాదిన చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపించిన పోలీస్‌లు పోక్సో యాక్ట్ క్రింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఎనిమిదేండ్ల సుదీర్ఘ విచారణ అ నంతరం పోక్సో న్యా యస్థానం ఇన్‌చార్జి రోజా రమణి సోమవారం నిందితుడికి 21 సంవత్సరాల కా రాగార శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించి 30వేలు జరిమానా విధించారు.

బాధితురాలికి 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ప్రకటించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఐవోలుగా కె. భాస్కర్ రెడ్డి, డి సైదులు బాబు, కె.పాండు రంగారెడ్డి, భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పన కీలకంగా వ్యవహరించారు. ఈ తీర్పు లైంగిక వేధింపులకు పాల్పడే వారికి గుణపాఠంగా మారిందని ప్రజలు పేర్కొన్నారు.