21 August, 2026 | 4:35 PM

Breaking News

శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం   •   తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •   విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల వినతి   •  

చురుకుగా ట్రిబుల్ ఆర్ పనులు

22-09-2025 12:05 AM

తూప్రాన్, సెప్టెంబర్ 21 :రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ త్రిబుల్ ఆర్ గా వాడుకలో ఉన్న గ్రీన్ ఫీల్ ఎక్స్ప్రెస్ హైవే కు సం బం ధించిన భూసేకరణ పనులు చివరి దశలో ఉన్నాయని ఆర్డీవో జయచంద్రారెడ్డి తెలిపారు. భూసేకరణలో అన్ని ప్రక్రియలు ముగిసి, నష్టపరిహారాన్ని నిర్ణయించే దశలో ఉన్నట్లు తెలుస్తుంద న్నారు.

రైతులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఇతర వివరాలను రెవెన్యూ సిబ్బంది సేక రించి నేషనల్ హైవే అథారిటీ వారి వ్బుసైట్ అయిన భూమి రాశి పోర్టల్ లో నమోదు చేస్తున్నా రు. ఈ నమోదు ప్రక్రియలో సాంకేతికంగా సంక్లిష్టంగా ఉండడం వల్ల ఆలస్యం అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని సిబ్బంది ఆదివారం సెలవు రోజైనా పనిచేస్తున్నారని అన్నారు.

రైతుల ఇంటి వద్దకే వెళ్లి వారితో సిబ్బంది వ్యక్తిగతంగా మాట్లాడటం వల్ల రైతులకు ఈ ప్రక్రియ మీదున్న సందేహ నివృత్తి జరుగుతుందని ఆర్డిఓ తన సిబ్బందికి ఆదేశించడంతో, వారు గ్రామ పంచాయతీలో కూర్చొని నోటీసులు ఇవ్వకుండా, రై తుల ఇంటి వద్దకే వెళ్లి నోటీసులు ఇస్తూ, వారికి భరోసాను కల్పిస్తున్నారు. మొత్తం మీద నెల రో జుల వ్యవధిలో రైతులకు ఆర్డిఓ నిర్ణయించిన ధర ప్రకారం జిల్లా కలెక్టర్ నిర్ణయించే ధర ప్రకారం రెండో విడతగా డబ్బులు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందని ఆర్డీవో తెలిపారు.