27 July, 2026 | 12:54 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

ప్రమాదకర పరిస్థితిలో అయిజ పెద్దవాగు వంతెన

26-11-2025 12:00 AM

అయిజ, నవంబర్ 25: జోగులమ్మ గద్వాల జిల్లా అయిజ నుండి కర్నూలు వెళ్ళే రోడ్డు పై సుమారు 70,80 సంవత్సరాల క్రితం నిర్మించిన వంతెన పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. అట్టి వంతెన పై ఈరోజు బిజెపి నాయకులు కోత్త బిడ్జి నిర్మాణం చేయాలని శిథిలమైన బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు. దానివల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగినది.  సుమారు అటు కిలోమీటర్ ఇటు కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోయి.

మూడు రాష్ట్రాలను కలిపే రహదారి అయినందువల్ల వాహనాల రాకపోకలు ఎక్కువగా జరుగుతున్నాయి. బ్రిడ్జి పై పగుళ్లు వచ్చి రంద్రాలు ఏర్పడి వాహనాలు నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. కావున ఇట్టి బ్రిడ్జిని నిర్మించాలని రాస్తారోకో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.