17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

రేపటి జీపీఓ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి

24-05-2025 07:30 PM

అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్..

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో రేపు నిర్వహించనున్న గ్రామ పాలన అధికారుల నియామక పరీక్షకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్(Additional Collector Kishore Kumar) శనివారం ఒక ప్రకటన తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. చాణక్య హై స్కూల్ (రెడ్డి ఫంక్షన్ హాల్ సమీపంలో) లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. సెల్‌ఫోన్‌ సహా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను తప్పనిసరిగా తీసుకురావాలని అదనపు కలెక్టర్ తెలిపారు.