10 April, 2026 | 7:41 PM

Breaking News

భవన నిర్మాణ కార్మికులకు కార్మిక భవన్ ఏర్పాటుకు సహకరిస్తా   •   విజయక్రాంతి ఎఫెక్ట్   •   రుద్రారం శివారులో అక్రమ ఇసుక టిప్పర్ సీజ్... ఒకరి అరెస్ట్   •   రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం   •   దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •  

అవినీతి నిర్మూలనలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలి

10-12-2025 01:30 AM

కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపు 

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) డిసెంబర్ 9 (విజయక్రాంతి): అవినీతి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా అవినీతి నిరోధక శాఖ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవినీతి నిర్మూలన వాల్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబరు 3 నుండి 9వ  వరకు అవినీతి నిర్మూలన వారోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ విభాగాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు పొందే ప్రతి పౌరుడు అవినీతి విషయమై జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా అవినీతి ఘటనలు గమనించినప్పుడు వెంటనే అవినీతి నిరోధక శాఖకు తెలియచేయాలని సూచించారు.

పారదర్శక పరిపాలనకు ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి  తాను చేయాల్సిన ప్రభుత్వ సేవలకు లంచం అడిగితే  ఎసిబి టోల్ ఫ్రీ  నంబర్ 1064కు కాల్ చేయాలని సూచించారు..ఈ కార్యక్రమంలో ఎసిబి డిఎస్పీ సాంబయ్య, సిఐ రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.