13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

కాబోయే ముఖ్యమంత్రి బీసీనే

09-01-2026 06:13 PM

-రిజర్వేషన్లపై విచారణ తర్వాతే ఎన్నికల నిర్వహించాలి

 బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్

హనుమకొండ,(విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు దోబూచులాడుతున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని వచ్చినప్పుడల్లా అన్ని పార్టీల నాయకులకు 50 శాతం రిజర్వేషన్ సీలింగ్ గుర్తుకు వస్తోందని విమర్శించారు. బీసీలు మరింత ఉధృతంగా ఉద్యమించకపోతే తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

కోర్టులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై విచారణ జరుగుతున్న సమయంలో మున్సిపల్ ఎన్నికలకు అంత తొందర ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం, ప్రతిపక్షాల వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. 2028లో బీసీయే ముఖ్యమంత్రి అవుతారని, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు బీసీలంతా ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర బంద్ సందర్భంగా బీసీలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.