20 June, 2026 | 3:11 PM

Breaking News

హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •   ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు.. దగా రాజ్యం: లింగాల కమల్ రాజు   •  

రైతుకు ఎల్లప్పుడూ భరోసా

11-11-2025 07:51 PM

మండల పీఎసిఎస్ చైర్మన్ జి శ్రీనివాస్ రెడ్డి..

కోయిల్ కొండ: రైతులకు ఎల్లప్పుడూ ప్రజాపాలన ప్రభుత్వం అండగా నిలబడుతుందని మండల పీఎసిఎస్ చైర్మన్ జి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలో వింజమూర్, సంగనోనీ పల్లి, బూరుగుపల్లి, తిరుమల పల్లి, ఉబర్ తండాలలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా అండగా నిలబడాలని సంకల్పంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అంశాన్ని రైతులు గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల విద్యాసాగర్ గౌడ్, సీనియర్ నాయకులు సత్యపాల్ రెడ్డి, రాజు నాయక్, రవి నాయక్, నాయకులు పాల్గొన్నారు.