15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రైతుకు ఎల్లప్పుడూ భరోసా

11-11-2025 07:51 PM

మండల పీఎసిఎస్ చైర్మన్ జి శ్రీనివాస్ రెడ్డి..

కోయిల్ కొండ: రైతులకు ఎల్లప్పుడూ ప్రజాపాలన ప్రభుత్వం అండగా నిలబడుతుందని మండల పీఎసిఎస్ చైర్మన్ జి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలో వింజమూర్, సంగనోనీ పల్లి, బూరుగుపల్లి, తిరుమల పల్లి, ఉబర్ తండాలలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా అండగా నిలబడాలని సంకల్పంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అంశాన్ని రైతులు గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల విద్యాసాగర్ గౌడ్, సీనియర్ నాయకులు సత్యపాల్ రెడ్డి, రాజు నాయక్, రవి నాయక్, నాయకులు పాల్గొన్నారు.