27 June, 2026 | 7:27 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

అంబేద్కర్ భవనం తక్షణమే నిర్మించాలి

20-05-2025 12:05 AM

దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి 

మెదక్, మే 19(విజయక్రాంతి ): మెదక్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ నాలుగు దళిత సంఘాలకు చెందిన నాయకులు జిల్లా కలెక్టర్  రాహుల్ రాజుకు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అంబేద్కర్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించి క్యాన్సల్ చేయడం అన్యాయం  అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రత్యేక చొరవ  తీసుకొని అంబేద్కర్ భవన నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ స్పందించి త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ నిచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేశం, ఎస్సీ, ఎస్టీ,కమిటీ దళిత సంఘ నాయకులు పాతూరి రాజు తదితరులు పాల్గొన్నారు.