17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కారుణ్య నియామకాల్లో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు

20-05-2025 12:04 AM

ఉదారత చాటుకున్న కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి టౌన్, మే 19 (విజయక్రాంతి),: కారుణ్య నియామకాల్లో  భాగంగా ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగ ఉత్తర్వులను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు.

రెండు నెలల క్రితం విధి నిర్వహణలో   రోడ్డు ప్రమాదంలో మరణించిన వడ్ల రవి కూతురు సౌఖ్య కు, అలాగే అనారోగ్యంతో మరణించిన కానిస్టేబుల్ రమేష్ కుమార్తె మానస కు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక పత్రాలు సోమవారం ఆయన అందజేశారు.

నియామక పత్రాలు అందుకున్న వెంటనే ఈరోజు నుంచి జిల్లా పోలీస్ కార్యాలయంలో సౌఖ్య, మానస విధుల్లో చేరారు. ప్రమాదం జరిగి మరణించిన వడ్ల రవి, అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ రమేష్ కూతుర్లకు రెండు నెలల లోపే నియామక పత్రాలు అందజేసి జిల్లా ఎస్పీ తన ఉదారతను  చాటుకున్నారు.

అనంతరం  ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాలకు విడతల వారీగా కారుణ్య నియామకాలలో ఉద్యోగాలు వస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈరోజు ఉద్యోగాల్లో నియమితులైన సౌఖ్య, మానసల ను ఆయన అభినందించారు.

తమ తండ్రుల్లాగా విధుల్లో నిజాయితీగా నిధులు నిర్వహిస్తూ డిపార్ట్మెంట్ కు మంచి పేరు తీసుకురావాలని ఆయన వారికి సూచించారు. విధులు నిర్వహిస్తూ మరణించిన ఇరు కుటుంబాలకు రెండు నెలల లోపే కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలు అందించిన జిల్లా ఎస్పీకి ఈ సందర్భంగా జిల్లా పోలీసు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కే .నరసింహారెడ్డి, ఏవో ఎండి. అప్సర్, సూపరిండెంట్లు గంగాధర్, జమీల్ అలీ తదితరులు పాల్గొన్నారు.