6 March, 2026 | 9:06 PM

కొట్టుకుపోయిన చెక్ డ్యాంపై అన్ని కోణాల్లో విచారణ జరపాలి

18-12-2025 05:21 PM

టీపీసీసీ ఎన్నికల కమీషన్ కో ఆర్డినేషన్ కమీటి సభ్యులు శశిభూషణ్ కాచె

మంథని (విజయక్రాంతి): మంథని మండలంలోని అడవి సోమనపల్లి మానేరు నదిలో నిర్మించిన చెక్ డ్యాం కొట్టుకుపోయిన ఘటనలో చెక్ డ్యాంపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని టీపీసీసీ ఎన్నికల  కమీషన్ కో ఆర్డినేషన్ కమీటి సభ్యులు శశిభూషణ్ కాచె అధికారులను కోరారు. మనేరు నదిపై వద్ద నాణ్యత ప్రమాణాలు పాటించకుడా నిర్మించిన చెక్ డ్యాం వ్యవహారాలంలో అన్ని కోణాల్లో విచారణ జరపాలని గురువారం రాష్ట్ర పరిశ్రమ, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ  కుమార్ రేడ్డి, ఉన్నత అధికారులను కోరారు. విచారణలో వాస్తవ విషయాలు బయటకు వస్తాయని కాచె తెలిపారు.