18-12-2025 12:19:51 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ 17 : శీతాకాల సమావేశాల సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీకి చెందిన ఒక ఎంపీ కొద్ది రోజులుగా ఈ- సిగరెట్ తాగుతున్నట్లు బుధవారం బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంఘటన తన దృష్టికి లిఖిత పూర్వకంగా ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ పేర్కొన్నారు.