9 July, 2026 | 5:46 AM

అనసూయమ్మ మృతి బాధాకరం

05-09-2025 01:04 AM

మోతె, సెప్టెంబర్ 4  : సీనియర్ న్యాయవాది పొదిల ప్రదీప్ కుమార్ మాతృమూర్తి  అనసూయమ్మ మృతి బాధాకరమని బి ఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శీలం సైదులు  అన్నారు. రాఘవ పురం ఎక్స్ రోడ్డు లోని నివాసంకు గురువారం వెళ్లి అనసూయ పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  అనసూయమ్మ అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శం ఏమన్నారు.

తదుపరి ఆమె కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ శంకర్ నాయక్, మాజీ ఎంపిటిసి మద్దిమసూదన్ రెడ్డి, మిక్కిలినేని సతీష్, నామవరం గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్టల నగేష్, సామ ప్రభాకర్ రెడ్డి, దూషర్ల సోమయ్య, కారింగుల వెంకన్న,అనసూయ కుటుంబ సభ్యులు ఉన్నారు.