9 April, 2026 | 6:53 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

భారత్ దుర్గా సేవాసమితి ఆధ్వర్యంలో అన్నప్రసాదం

02-10-2025 12:26 AM

కామారెడ్డి, అక్టోబర్ 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భారత్ దుర్గా సేవా సమితి, ( B.ౄ.S.S ) భారత్ రోడ్, ఆధ్వర్యంలో దుర్గామాత అమ్మవారి సన్నిధిలో బుధవారం అన్నప్రసాద వితరణ ( అన్నదానం ) కార్యక్రమం నిర్వహించారు.  అన్నప్రసాదం స్వీకరించాడనికి 45, 46, 47 వార్డుల నుండి భారత్ రోడ్, పెద్ద బజార్, గడిరోడ్, చిన్న కసాబ్ గల్లీ, కమ్మరి గల్లీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలందరూ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించారు. 

అన్నప్రసాద కార్యక్రమం లో భారత్ దుర్గా సేవా సమితి ప్రతినిధులు గెరిగంటి లక్ష్మినారాయణ, బోడ్డు కుమార స్వామి, తాటిపల్లి సునీల్, చెన్నం స్వామి, కాకర్ల రవికుమార్, బట్టు భాస్కర్, బోడ్డు శ్రావణ్, మంత్రి బాలి, చింతల రాజు, సంగమేశ్వర్, సాయికుమార్, సాయి ఈశ్వర్, గెరిగంటి నిఖిల్, సుశీలు, పాండు, మధు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.