18-09-2025 12:07:52 AM
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలుగు విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులకు స్పాట్ అడ్మిషన్స్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కమిటీ డైరెక్టర్ డా.బి.రాధ తెలిపారు. ఆసక్తిగలవారు ఈ నెల 19, 20లలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, బాచుపల్లి ప్రాంగణంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చ న్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 600 డీడీ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.