calender_icon.png 5 May, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిగ్రీకోర్సులకు 15లోగా దరఖాస్తు చేసుకోండి

05-05-2025 01:45:32 AM

బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బీ సైదులు

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): 2025-26 నూతన విద్యాసంవత్సరానికి బీసీ గురుకులాల్లో డిగ్రీ కోర్సుల్లో సీటు కోసం దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించినట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి బీ సైదులు తెలిపా రు. ఈ నెల 15వ తేదీలోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆదివారం ఒక ప్రకటన లో ఆయన సూచించారు.

ఇంటర్ పూర్తి చేసి న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేర కు గడువును పొడించినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల న్నారు. ఇప్పటికే మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేయనవసరం లేదన్నారు.