12-09-2025 11:28:14 PM
నంగనూరు: నంగునూరు మండలంలో 20 రెవెన్యూ గ్రామాలకు గాను 11 క్లస్టర్లను ఏర్పాటు చేసి, గ్రామ పాలన అధికారాలు (GPO)లు నియామకం అయినట్లు శుక్రవారం తహసీల్దార్ సరిత తెలిపారు.ఈ నియామకల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు, సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించేందుకు వీలు కలుగుతుందన్నారు.
క్లస్టర్ల వారీగా నియమించబడిన ప్రత్యేక జిపిఓలు:
కొండంరాజుపల్లి, ఖాతా: ఎన్. మమత
ఘనాపూర్, అక్కనపల్లి: ఎం. శ్రీనాథ్
గట్లమల్యాల,సంతోష్ నగర్: జి. రమేష్
నంగునూరు, సిద్ధనపేట: డి. దేవరాజు
ఖానాపూర్,నాగరాజుపల్లి, అంక్సాపూర్: ఆంజనేయులు
నర్మెట్ట, మైసంపల్లి, అప్పలాయిచెరువు: ఎన్. సాయిలు
ముండ్రాయి, రాజగోపాల్పేట్: ఎం. శివరాజం
పాలమాకుల: పి. మమత
బద్దిపడగ,దర్గాపల్లి,జేపీ తండా: జి. రమేష్
మగ్గంపూర్, రాంపూర్: ఎస్. రవీందర్
కోనాయిపల్లి,వెంకటాపూర్,తిమ్మాయిపల్లి
ఈ నియామకాలతో మండలంలోని గ్రామాల ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందుతాయని తహసిల్దార్ సరిత తెలిపారు.