12-06-2025 12:00:00 AM
భిన్న ప్రాంతాలు, మతాలు, కులాలు, భాషలు, సంస్కృతి సంప్రదాయాలు వున్న ఈ దేశంలో జాతీయ ఐక్యత లేకపోతే జమిలి ఎన్నికల చట్టం సఫలం కాదు. ఒకేసారి ఎన్నికలు జరిగితే, ప్రాంతీయ ప్రయోజనాలు జాతీయ అంశాల ఆధిపత్యంలో మరుగున పడే ప్రమాదం ఉందన్నది కొందరి అభిప్రాయం. ఉదా॥కు 2019 ఎన్నికల్లో పుల్వామా-, బాలాకోట్ ఘటనలు జాతీయ భద్రత ఎజెండాగా మారగా, రాష్ట్ర స్థాయి స్థానిక సమస్యలను వెనక్కి నెట్టి వేశాయి. అదే విధంగా, మెజారిటీ ప్రజల అభిప్రాయాలు ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి.
ఇక్కడ మెజారిటీ అంటే కేవలం మతం మాత్రమే కాదు, భాష, రాష్ట్ర గుర్తింపు కూడా.
ఒకే దేశం -ఒకేసారి ఎన్నికలు (జమిలి) అనే విధానం భారత రాజకీయ వ్యవస్థలో గత కొన్ని ఏండ్లుగా చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో 1951 నుంచి 1967 వరకు, లోక్సభ, రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యం తగ్గుముఖం పట్టడం, 1980 దశకంలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం, 1990ల లో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటు వంటి కారణాలతో ఈ విధానం క్రమంగా మారిపోయింది.
1989 నుంచి 2014 వరకు ఏ ఒక్క పార్టీ కూడా కేంద్రంలో సొంతంగా మెజారిటీ సాధించలేదు. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా అధికారం చేపట్టినప్పటికీ, 2024 లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించలేక మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
జమిలి ఎన్నికలు అంటే లోక్సభతోపా టు రాష్ట్ర శాసనసభలకు ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించడం. అఖండ భారతావనిలో ఇది సాధ్యమేనా? అనే ప్రశ్న ఉత్ప న్నమవుతుంది. రాజ్యాంగం ప్రకారం ఈ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్సభ, రాజ్యసభల్లో ప్రత్యేక మెజారిటీ, అలాగే సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరం.
గత ఏడాది మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సిఫారసులను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రెండు బిల్లులు 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లులు లోక్సభలో ప్రవేశపెట్టగా, జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపడం జరిగింది.
జాతీయ అంశాలకు ప్రాధాన్యం
లోక్సభలో ఎన్డీఏకు 293 సీట్లతో సాధారణ మెజారిటీ ఉంది. కానీ, మూడిం ట రెండు వంతుల మెజారిటీ (362) కోసం వివిధ రాజకీయ పార్టీల మద్దతు అవసరం. రాజ్యసభలో ఎన్డీఏకు 129 సీట్లు ఉండగా, బిల్లు ఆమోదానికి 163 సీట్లు కావాల్సి ఉంది. బీజేడీ, వైసీపీ వంటి పార్టీల మద్దతు బిల్లు ఆమోదానికి కీలకం. సగానికిపైగా రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉండటం వల్ల రాష్ట్రాల శాసనసభల ఆమో దం సులభం కావచ్చు. కానీ, బిల్లు చట్టరూ పం దాల్చినా అమలులో అనేక సవాళ్లు తలెత్తే అవకాశం ఉన్నట్టు విశ్లేషణలు చెబుతున్నాయి.
భారతదేశ జనాభా దాదాపు 145 కోట్లు. భిన్న ప్రాంతాలు, మతాలు, కులా లు, భాషలు, సంస్కృతి సంప్రదాయాలు వున్న ఈ దేశంలో జాతీయ ఐక్యత లేకపో తే ఈ చట్టం సఫలం కాదు. ఒకేసారి ఎన్నికలు జరిగితే, ప్రాంతీయ ప్రయోజనాలు జాతీయ అంశాల ఆధిపత్యంలో మరుగున పడే ప్రమాదం ఉందన్నది కొందరి అభిప్రాయం.
ఉదా॥కు 2019 ఎన్నికల్లో పుల్వా మా-, బాలాకోట్ ఘటనలు జాతీయ భద్ర త ఎజెండాగా మారగా, రాష్ట్ర స్థాయి స్థాని క సమస్యలను వెనక్కి నెట్టి వేశాయి. అదే విధంగా, మెజారిటీ ప్రజల అభిప్రాయాలు ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తా యి.ఇక్కడ మెజారిటీ అంటే కేవలం మతం మాత్రమే కాదు, భాష, రాష్ట్ర గుర్తింపు కూడా.
అమలు 2026 తర్వాతే
2021 జనగణన ఇప్పటి వరకు జరగలేదు. ఇది జరిగిన తర్వాత లోక్సభ, రాష్ట్రా ల శాసనసభల సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్) జరిగే అవకాశం ఉంది. 2023 మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం, 33% సీట్లు మహిళలకు కేటాయించడం జరుగుతుంది.ఇది 2026 తర్వాత అమలు కానుం ది. జనాభా పెరుగుదల ఆధారంగా ఉత్తర భారత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్లలో లోక్సభ సీట్లు గణనీయంగా పెరిగే అవకా శం ఉంది.
కానీ, దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలలో సీట్ల పెరుగుదల అంతగా ఉండ క పోవచ్చు. ఉదా॥కు ప్రస్తుతం ఈ ఐదు రాష్ట్రాల లోక్సభ సీట్లు (129) కలిపినా ఉతరప్రదేశ్ (80), బీహార్ (40) సీట్లతో సమానం కావు. ఈ అసమానత దక్షిణాది రాష్ట్రాల్లో అసంతృప్తిని రేకెత్తించవచ్చు.
భాషా వైవిధ్యం కూడా ఒక సమస్య. ఒకేసారి ఎన్నికలు జరిగితే, హిందీభాషకు మరింత ప్రాముఖ్యం లభించే అవకాశం ఉంటుంది. ఇది తమిళం, తెలుగు, కన్నడ వంటి దక్షిణాది భాషల గుర్తింపును దెబ్బ తీస్తుందని దక్షణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు భావిస్తున్నారు.
తమిళనాడులో డీఎంకే వంటి పార్టీలు ఈ చట్టాన్ని ఫెడరలిజానికి ముప్పుగా చూస్తున్నాయి. దాదాపు 145 కోట్ల జనాభాతో సుమారు వంద కోట్ల ఓటర్లతో, దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడానికి లక్షల సంఖ్యలో ఈవీఎంలు, పోలింగ్ సిబ్బంది, భారీ భద్రతా ఏర్పాట్లు అవస రం. వర్షాకాలం, పండుగలు, రిమోట్ ప్రాంతాలు వంటివి ఈ ప్రక్రియను సం క్లిష్టం చేస్తాయి. అంతేకాదు, ప్రభుత్వం మధ్యలో పడిపోతే, మిగిలిన కాలానికి మా త్రమే ఎన్నికలు జరపడం అస్థిరతను పెంచవచ్చు. రెండు లేదా మూడేళ్ల పాలన కోసం ఎన్నికలు జరిగితే, రాజకీయ నాయకులు దీర్ఘకాలిక విధానాలపై దృష్టి పెట్టకుండా అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుంది.
ప్రాంతీయ ఆకాంక్షల సమతుల్యత
ఎన్నికల ఖర్చు తగ్గుతుందని చెబుతున్నప్పటికీ, అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్దేశించిన పరిమితికి మించి ఎన్నో రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. జమిలి ఎన్నికల వల్ల ఎన్నికల నిర్వహణ ఖర్చును తగ్గించవచ్చు అన్నది ఒకవైపు వాదన. దీనివల్ల జాతీయ పార్టీలకు మాత్రమే లబ్ధి చేకూరుతుందనేది ప్రాంతీయ పార్టీల వాదన. వాస్తవానికి కొంతవరకు ప్రాంతీయ పార్టీలు, స్థానిక సమస్యలు ఈ ప్రక్రియలో వెనుకబడే ప్రమాదం ఉంది.
రామ్నాథ్ కోవింద్ కమి టీ పలు రాజకీయ పార్టీలతో సంప్రదించి, 32 పార్టీలు మద్దతు తెలిపాయని, 15 పార్టీ లు వ్యతిరేకించాయని నివేదించింది. బీజే పీ, జేడీ(యూ), టీడీపీ వంటి ఎన్డీఏ మిత్రపక్ష పార్టీలు మద్దతు ఇచ్చాయి. కానీ, కాం గ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఏఏపీ వంటి పార్టీ లు ఫెడరలిజం, ప్రాంతీయ గుర్తింపుకు ముప్పు వాటిల్లుతుందని వ్యతిరేకించా యి. ప్రపంచంలో కొన్ని పాశ్చాత్య దేశాలు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నాయి.
కానీ, అవి భారతదేశంతో పోలిస్తే చిన్న వి, తక్కువ వైవిధ్యం కలిగినవి. భారతదేశం లాంటి సువిశాల, వైవిధ్యభరిత దేశంలో జమిలి ఎన్నికలు అమలు చేయడం సవాలుతో కూడుకున్నది. ఒకవేళ 2029 నాటి కి లోక్సభ, రాష్ట్ర శాసనసభల ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉంటే మధ్యంత ర ఎన్నికలు, రాజకీయ అస్థిరతలు, న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.
జమిలి ఎన్నికలు ఖర్చు తగ్గించి పాలనా సామర్థ్యాన్ని పెంచవచ్చు. కానీ, ఫెడరలిజం, ప్రాంతీయ గుర్తింపు, స్థానిక సమస్యలను విస్మరించే ప్రమాదం ఉంది. జాతీయ ఐక్యతతోపాటు ప్రాంతీయ ఆకాంక్షలను సమతుల్యం చేయగలిగితేనే ఈ చట్టం భారత రాజకీయ వ్యవస్థలో ఎక్కువ కాలం నిలబడగలదు. రానున్న రోజుల్లో జేపీసీ చర్చలు, ప్రజల అభిప్రాయాలు దీని భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
వ్యాసకర్త సెల్: 9959046499