27 July, 2026 | 12:54 PM

Breaking News

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •  

ఆయుధ వ్యాపారి కేసు.. వాద్రాపై ఈడీ ఛార్జిషీట్

21-11-2025 12:42 AM

న్యూఢిల్లీ, నవంబర్ 20 : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. బ్రిటన్‌కు చెందిన ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ కేసుతో సం బంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈ ఛార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టులో సమర్పించింది. మనీలాండరింగ్‌కు సంబంధించి రాబర్ట్ వాద్రాపై ఇది రెండో ఛార్జిషీట్. ఈ ఏడాది జూలైలో షికోపుర్ భూముల వ్యవహారంలో ఈడీ ఆయనపై ఓ అభియోగ పత్రాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఢిల్లీలోని ఆయుధ వ్యాపారి సంజ య్ భండారీ ప్రాంగణంపై 2016లో ఆదాయ పు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. డిజిటల్ డేటా, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రాబర్ట్ వా ద్రా పేరు వెలుగుచూసిందని, లండన్‌లోని ఓ స్థిరాస్తితో వాద్రాకు సంబంధం ఉందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో 2017 ఫిబ్రవరిలో ఈడీ ‘నగదు అక్రమ చలామణి చట్టం’కింద భండారీ తదితరులపై కేసు నమోదుచేసింది.