17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఆయుధ వ్యాపారి కేసు.. వాద్రాపై ఈడీ ఛార్జిషీట్

21-11-2025 12:42 AM

న్యూఢిల్లీ, నవంబర్ 20 : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. బ్రిటన్‌కు చెందిన ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ కేసుతో సం బంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈ ఛార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టులో సమర్పించింది. మనీలాండరింగ్‌కు సంబంధించి రాబర్ట్ వాద్రాపై ఇది రెండో ఛార్జిషీట్. ఈ ఏడాది జూలైలో షికోపుర్ భూముల వ్యవహారంలో ఈడీ ఆయనపై ఓ అభియోగ పత్రాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఢిల్లీలోని ఆయుధ వ్యాపారి సంజ య్ భండారీ ప్రాంగణంపై 2016లో ఆదాయ పు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. డిజిటల్ డేటా, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రాబర్ట్ వా ద్రా పేరు వెలుగుచూసిందని, లండన్‌లోని ఓ స్థిరాస్తితో వాద్రాకు సంబంధం ఉందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో 2017 ఫిబ్రవరిలో ఈడీ ‘నగదు అక్రమ చలామణి చట్టం’కింద భండారీ తదితరులపై కేసు నమోదుచేసింది.