17 April, 2026 | 11:49 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సౌకర్యాల ఏర్పాటు

06-11-2025 04:42 PM

జిల్లా సహకార అధికారి శ్రీ మాల..

సుల్తానాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా సహకార అధికారి శ్రీ మాల అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం సుల్తానాబాద్ పట్టణంలోని సుగ్లంపల్లిలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి డిసిఓ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసిఓ శ్రీ మాల మాట్లాడుతూ గన్ని సంచుల కొడత లేకుండా చూడడం జరుగుతుందన్నారు.

కొనుగోలు కేంద్రాలలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే అధికారులు దృష్టికి తీసుకురావాలని సూచించారు. వర్షం నుంచి ధాన్యాన్ని రక్షించుకున్నందుకు రైతులు కూడా సహకరించాలని కోరారు. రైతులు కూడా సెంటర్ నిర్వాహలకు సహకరించాలని సూచించారు. అంతకుముందు డిసిఓ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్టర్ వెంకటేశ్వర్లు, నాయకులు గాజుల రాజమల్లు, పన్నాల రాములు, దుగ్యాల సంతోష్ రావు, లక్ష్మీనారాయణ, శేఖర్, సీఈవో బూరుగు సంతోష్, సెంటర్ నిర్వాహకులు, రైతులు, హమాలీలు, పలువురు ఉన్నారు.