15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలి

31-01-2026 03:47 PM

బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. హరిత దంపతులు

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న జిల్లా కలెక్టర్ కె. హరిత దంపతులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆలయ కమిషనర్ వేణుగోపాల్ కలెక్టర్ దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.