15 June, 2026 | 11:43 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

తొమ్మిదో తరగతి విద్యార్థినిచే అష్టావధానం

10-12-2025 01:19 AM

తెలుగు, సంస్కృత సాహిత్య వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం

ముషీరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): భారతీయ ’సాహిత్య-సాంస్కృతిక’ సంప్రదాయంలో విశిష్ట ఘట్టంగా హైదరాబాద్ లోని ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ కు చెందిన 9వ తరగతి విద్యార్థిని అహలా అయ్యల సోమయాజు అష్టావధానం ప్రదర్శించింది. 14 ఏళ్ల వయసులో అష్టావధానం ప్రదర్శించడం అత్యంత అరుదైన సాధన, వెంకటాద్రి అవధాని, వడ్డిపర్తి పద్మాకర, మేదాసాని మోహన్ వంటి మహానుభావులు మాత్రమే ఈ ఘనతను సాధించారు.

శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి, ఎల్చూరి మురళీధర్ రావు, రేవూరి ఆనంత పద్మనాభం, తనికెళ్ళ భరణి, దర్శనం శర్మ, యోగి చెంబోలు, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ వ్యవస్థాపకురాలు, ప్రిన్సిపాల్ శైలజా రావు, కాంచి పీఠం హనుమంతరావు, డీ.ఆర్.డీ.వో రిటైర్డ్ సైంటిస్ట్ చామర్తి శ్రీనివాస్, రచయిత్రి వెల్పూరి సుజా త, త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వడ్డిపర్తి పద్మాకర్, విద్యారణ్యం వేద పాఠశాల వ్యవస్థాపకులు మడుగుల శశిభూషణ సోమయాజి హాజరై ఆశీర్వదించారు.