12-07-2025 12:00:00 AM
భువనేశ్వర్, జూలై 11: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. రాజ్యాంగం నుంచి లౌకిక, సోషలిస్ట్ పదాలను తొలగించేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. భువనేశ్వర్లో శుక్రవారం ‘సంవిధాన్ బచావో’ కా ర్యక్రమంలో ఖర్గే మాట్లాడారు. బీ జేపీ ప్రభుత్వం ప్రజల హక్కుల్ని కాలరాస్తోందన్నారు.తమ హక్కుల కోసం దళితులు,ఆదివాసీలు పోరాడటం తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ హ యాంలో 160 ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేస్తే.. బీజేపీ వాటిని ప్రైవేటీకరణ చేసిందన్నారు.