7 July, 2026 | 12:58 PM

Breaking News

డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం దగ్గర ఉద్రిక్తత   •   తృటిలో తప్పిన ప్రమాదం   •   భువనగిరి మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం సంతాపం   •   బాన్సువాడ పట్టణంలో డ్రైనేజీలపై ఉన్న దుకాణాల తొలగింపు   •   డ్రైనేజీలపై ఆక్రమణల తొలగింపుకు ప్రజలు సహకరించాలి   •   పొలమెళ్లిన ప్రాణం తిరిగిరాలేదు.. అనాథలైన భార్యాపిల్లలు   •   ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం   •   నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయి: మల్కాజిగిరి సీపీ సుమతి   •   మహారాష్ట్రలో వర్షబీభత్సం.. 24 గంటల్లో 67 సెం.మీ వాన   •  

గురుకులాల్లో ఘటనలకు అధికారులదే బాధ్యత

19-07-2025 01:16 AM
  1. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
  2. బీసీ గురుకులాల అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): గురుకులాల్లో జరుగుతున్న వరుస ఘటనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. గురుకులాల్లో ఏ ఘటన జరిగినా అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. 327 బీసీ గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఆర్సీవోలు, గురుకుల సెక్రటరీ సైదులు, బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్‌తో పాటు ఇతర అధికారులతో శుక్రవారం మంత్రి పొన్నం జూమ్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆర్సీవోలు విధిగా గురుకులాలు తనిఖీలు చేయాలని సూచించారు. ప్రిన్సిపాళ్లు, టీచర్లు పిల్లలపై ఎప్పటి కప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పా రు. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడంలో రాజీపడద్దని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలలో శుభ్రత పాటించాలని, విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.