15 June, 2026 | 2:46 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

రక్తదానంపై అవగాహన పెరగాలి

21-11-2024 12:00 AM

చాలామందికి రక్తదానంపై అనేక అపోహలు ఉన్నాయి. అత్యవసర సమయంలో రక్తం అవసరమైతే ఇవ్వడానికి చాలా మంది ముందుకు రాకపోవడం దురదృష్టకరం. ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చునని వైద్య నిపుణులు చెప్తారు. రక్తదానం చేసేవారి శరీరంలోకి మరో రకంగా కొత్త రక్తం వస్తుందన్న విషయమూ ఇక్కడ గమనార్హమే. ఈ ప్రాధా న్యాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. రక్తదాన కార్యక్రమాలను చేపట్టే వారిని, సంస్థలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. కళాజాత బృందాలను ఏర్పరిచి గ్రామాలలో తగు అవగాహన కలిగించాలి. అత్యవసర సమయాల్లో రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావలసిన పరిస్థితులు కల్పించాలి. అప్పుడు బాధితులకు పెద్ద భరోసా ఇచ్చిన వాళ్లమవుతాం.

 -షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్