11-07-2025 07:04:46 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఖానాపూర్ ఎంపీడీవో సునీత పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని సత్తెనపల్లి గ్రామంలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. మురికి నీరు నిలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించి పరిసరాల పరిశుభ్రత లోపం వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను తెలిపారు.