17 July, 2026 | 2:24 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

పీఎంశ్రీ పాఠశాల ఉపాధ్యాయులకు అవగాహన

25-12-2025 02:57 AM

మేడ్చల్, డిసెంబర్ 24(విజయ క్రాంతి): గుండ్ల పోచంపల్లి పరిధిలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఆవిష్కరణ, డిజైన్, ఆశావాద వ్యాపారం (ఐడిఈ) బూట్ క్యాంపు వాలే డిక్టరీ మూడు రోజులపాటు నిర్వహించారు. పాఠశాల విద్య, సాహిత్య శాఖ ఏఐసిటిఈ, విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్, వాద్వానీ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించారు. ఇన్నోవేషన్ మైండ్ సెట్, డిజైన్ థింకింగ్, ఐడియా ఎగ్జిక్యూషన్, అడ్డంకులను అధిగమించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ భాస్కర్, గౌరవ అతిథిగా ఏఐసిటిఈ ఇన్నోవేషన్ సెల్ ప్రాంతీయ సంచాలకులు మయూర్ బోర్కర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ నరసింహారెడ్డి, కార్యదర్శి జె త్రిశూల్ రెడ్డి, కోశాధికారి త్రిలోక్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ ఏ మోహన్, ప్రిన్సిపల్ డాక్టర్ లోకనాథం, సమన్వయకర్త డాక్టర్ శోభన్, సైబర్ సెక్యూరిటీ విభాగాధిపతి డాక్టర్  లక్ష్మి, వివిధ విభాగాధిపతులు డాక్టర్ నాగరాజు, ప్రొఫెసర్ రమేష్, డీన్ ప్రసాద్, వెంకటేష్, సౌమ్య, సాయి కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.