10 April, 2026 | 8:15 PM

Breaking News

నిమ్మపల్లిలో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ప్రారంభం   •   నూతన తహసిల్దార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు   •   విద్యుత్ శాఖ కాంపౌండ్ లో అగ్నిప్రమాదం   •   ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పక్కాగా అరైవ్ అలైవ్ కార్యక్రమాలు నిర్వహించాలి   •   తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు   •   జనగణన భూ స్వాధీన పనుల పరిశీలన   •   నోస్ పార్మా కంపెనీ అనుమతులు రద్దు చెయ్యాలి   •   డీసీసీ పదవులు పొందిన వారికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆత్మీయ సన్మానం   •   విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్   •   నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ స్థల పరిశీలన   •  

పీఎంశ్రీ పాఠశాల ఉపాధ్యాయులకు అవగాహన

25-12-2025 02:57 AM

మేడ్చల్, డిసెంబర్ 24(విజయ క్రాంతి): గుండ్ల పోచంపల్లి పరిధిలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఆవిష్కరణ, డిజైన్, ఆశావాద వ్యాపారం (ఐడిఈ) బూట్ క్యాంపు వాలే డిక్టరీ మూడు రోజులపాటు నిర్వహించారు. పాఠశాల విద్య, సాహిత్య శాఖ ఏఐసిటిఈ, విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్, వాద్వానీ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించారు. ఇన్నోవేషన్ మైండ్ సెట్, డిజైన్ థింకింగ్, ఐడియా ఎగ్జిక్యూషన్, అడ్డంకులను అధిగమించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ భాస్కర్, గౌరవ అతిథిగా ఏఐసిటిఈ ఇన్నోవేషన్ సెల్ ప్రాంతీయ సంచాలకులు మయూర్ బోర్కర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ నరసింహారెడ్డి, కార్యదర్శి జె త్రిశూల్ రెడ్డి, కోశాధికారి త్రిలోక్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ ఏ మోహన్, ప్రిన్సిపల్ డాక్టర్ లోకనాథం, సమన్వయకర్త డాక్టర్ శోభన్, సైబర్ సెక్యూరిటీ విభాగాధిపతి డాక్టర్  లక్ష్మి, వివిధ విభాగాధిపతులు డాక్టర్ నాగరాజు, ప్రొఫెసర్ రమేష్, డీన్ ప్రసాద్, వెంకటేష్, సౌమ్య, సాయి కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.