06-05-2025 12:19:24 AM
యాచారం, మే 5: మండలంలో గడ్డమల్లయ్యగూడెం గ్రామంలో మండల అగ్రికల్చర్ అధికారి రవినాథ్ ఆధ్వర్యంలో సోమవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలురైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏకాద్రీ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎరువుల యాజమాన్యం పై రైతులకు అవగాహన కల్పిస్తూ తక్కువ యూరియా వాడకం పంట సాగు చేయడం సాగుకు అయ్యే ఖర్చు త గ్గించి అవసరం మేరకు రసాయనాలు వినియోగించి నేలతల్లి ఆరోగ్యానికి కాపాడాలని అన్నారు.
సాగునీటిని ఆదా చేయడం భావితరాలకు అందించడం ముఖ్యమని. రైతులకు వరి రకాలు యాజమాన్య పద్ధతులు కొత్తరకం రసాయనాలు, పురుగుమందు ల వాడకం పై రైతులకు అవగాహన కలిగించారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రాజేందర్ రెడ్డి , మండల వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు