4 April, 2026 | 3:27 PM

Breaking News

ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •  

అయ్యప్ప దీక్ష నూతన జీవన విధానానికి నాంది

08-11-2025 07:26 PM

సర్వోత్తంరెడ్డి, వేణారెడ్డి

సూర్యాపేట (విజయక్రాంతి): హరిహర పుత్ర అయ్యప్పస్వామి దీక్ష నూతన జీవన విధానానికి నాంధీ పలుకుతుందని ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, మార్కెట్ కమిటీ కొప్పుల వేణారెడ్డిలు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్- శిరీష దంపతుల నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజను సంగయ్య గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో వారు పాల్గొని మాట్లాడుతూ అయ్యప్ప స్వామికి నిర్వహించే పూజల్లో పడిపూజ ఎంతో విశిష్టమైనదన్నారు.

అనంతరం స్వాములకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎలిమినేటి రమేష్- ఉమా దంపతులు, చివ్వెంల మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధరావత్ వీరన్న నాయక్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ షేక్ జహీర్, పట్టణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు చెంచల నిఖిల్ నాయుడు, ఎర్రంశెట్టి సతీష్, పలువురు అయ్యప్ప మాలాధారణ స్వాములు పాల్గొన్నారు.