17 April, 2026 | 2:47 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

బాలలం మేము బాలలం పాట ఆవిష్కరణ..

27-11-2025 09:43 PM

బెజ్జంకి: విద్యతో పాటు వినూత్నమైన అంశాలతో విద్యార్థుల ఎదుగుదలకు పాటుపడాలని మండల విద్యాధికారి మహతీలక్ష్మీ అన్నారు. బుధవారం ప్రాథమిక పాఠశాలలో గుండారం విద్యార్థులు బాలల దినోత్సవం సందర్బంగా తీసిన బాలలం మేం బాలలం ఆడియో వీడియోను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మండల విద్యాధికారి మహతీలక్ష్మీ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు బాలల కోసం ఎంత చేసిన తక్కువే అనిపిస్తుందని అందుకొరకు పాటుపడుతున్న ఉపాధ్యాయుల కృషి మరువలేనిదని అన్నారు.

చిన్నారులు చేసిన నృత్యం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో పాట రచయిత ఉండ్రాళ్ళ రాజేశం మాట్లాడుతూ కల్మషం లేని బాలల కోసం మరిన్ని రచనలు చేస్తానన్నారు.  ప్రధానోపాధ్యాయులు ఉండ్రాళ్ళ తిరుపతి, శ్రీనివాస్, రామంచ రవీందర్, చౌడరం తిరుపతి, రాజేందర్ ,తిరుమలేశ్, సంధ్యారాణి, అనిత, శిరీష,హరీష,శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.