17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఆరోగ్యంపై అవగాహన ఉండాలి

17-11-2025 12:38 AM

ములకలపల్లి, నవంబర్ 16 (విజయక్రాంతి): కౌమార బాలికలు ఆరోగ్యం పై అవ గాహన కలిగి ఉండాలని గుడ్ షెఫర్డ్ సంస్థ సిస్టర్స్ సూచించారు.ములకలపల్లి లోని గుడ్ షెఫర్డ్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సుమారు 80 మంది బాలికలు, కౌమార బా లికలకు ఆరోగ్యపరమైన అంశాలపై, పౌష్టిక ఆహారంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో సంస్థ సిస్టర్ తో పాటు వైద్య సిబ్బంది రమాదేవి పాల్గొని వారికి పౌష్టికాహారం ప్రాము ఖ్యత,ఆరోగ్య సంరక్షణ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

అదేవిధంగా రుతుక్రమ సమయంలో పాటించ వలసిన పరిశుభ్రతపై కిశోర బాలికలకు వివరించారు. యుక్త వయసులో శారీరకంగా మానసికంగా ఎదుగుదలకు సంబంధించి సంతులిత ఆహారాన్ని తీసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో గుడ్ షెఫర్డ్ సిస్టర్స్ ఉదయ, దీప్తి, రాజ్యం, బెనూషియా సంస్థ సిబ్బంది సుజాత,సాగర్ నాగరాజు, సందీప్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.