27-09-2025 12:00:00 AM
ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : ఎన్నికల ప్రక్రియలో పూర్తి బాధ్యతాయుతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సదాశివనగర్ మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరగాలంటే పూర్తి అవగాహన ఉండాలని శిక్షణ కార్యక్రమం సద్వినియోగం చేసుకొని సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు.
ఎన్నికల ప్రక్రియలో పూర్తి బాధ్యతాయుతంగా ఉండాలని పొరపాట్లు జరిగుతే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మురళి, జిల్లా పరిషత్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రమేష్ బాబు, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో సంతోష్ కుమార్ , తాసిల్దార్ సత్యనారాయణ, మండల విద్యాధికారి యోసఫ్, మండల పంచాయతీ అధికారి సురేందర్, మాస్టర్ శిక్షకులు పాల్గొన్నారు.
సదాశివనగర్లో..
సదాశివనగర్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : రాబోయే ఎన్నికల ప్రక్రియలో అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వన్ అన్నారు.మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మురళి, జిల్లా పరిషత్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రమేష్ బాబు, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో సంతోష్ కుమార్, తాసిల్దార్ సత్యనారాయణ, మండల విద్యాధికారి యోసఫ్, మండల పంచాయతీ అధికారి సురేందర్ ,మాస్టర్ శిక్షకులు పాల్గొన్నారు.