27-09-2025 12:00:00 AM
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : నిజాం నిరంకుశ పాలనలో దొర లు, భూస్వాములు, పెత్తందారులు బడుగు, బలహీన వర్గాల ప్రజలను వెట్టిచాకిరీ చేపిస్తు బానిసలుగా చూస్తున్న రోజుల్లో చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం దున్నేవాడిదే భూమి అంటూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విస్నూర్ దేశ్ముఖ్ను ఎదిరించిన తెలంగాణ వీర వనిత సాకాలి ఐలమ్మ అని అన్నారు.
భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా సందర్భంగా ముఖ్యఅతిథిగా నిజామాబాద్ అర్బ న్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా బిజెపి ఓబీసీ మోర్చా నాయకులతో కలిసి వినాయక్ నగర్ విగ్రహాల పార్క్ వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. రాణి రుద్రమ దేవి పౌరుషన్నిపాలు పంచుకున్న ఓరుగల్లు ముద్దు బిడ్డ సాకలి ఐలమ్మ ఆనాడు ఆమె పండించిన పంటను దొర గుండాలు అక్రమంగా తీసుకెళ్తుంటే ఎదురు తిరిగి గుండాలను తరిమి కొట్టిన ఆమె విజయం తెలంగాణలో భూపోరాటానికి నాంది పలికెల చేసిందన్నారు.
సాకలి ఐలమ్మ స్ఫూర్తి నేటి మహిళా లోకానికి ఆదర్శం అని ఆడది అంటే అభల కాదు ఆది పరశక్తి అని రుజువు చేసిన ధీర మహిళ సాకలి ఐలమ్మ అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో ఇద్దరే మహిళలు ఖురేషి, వ్యోమిక ఉగ్రస్తావరాలను ధ్వంసం చేసి భారతీయ మహిళా నారీ శక్తి అంటే ఏంటో ప్రపంచానికి నిరూపించారని అన్నారు. నేటి మహిళలు సాకలి ఐలమ్మ, రాణి రుద్రమ్మ, ఝాన్సీ లక్ష్మిబాయ్ లాంటి వీర వనితల పోరాట స్ఫూర్తితో వారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అవరోదించాలని సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి నాగోళ్ళ లక్ష్మినారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు స్వామి యాదవ్, గిరిబాబు, నాగరాజు, బుస్సాపూర్ శంకర్ బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.