10 May, 2026 | 8:11 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

పరమ్ సుందరి.. భీగి శారీ..!

09-08-2025 12:04 AM

సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ జంటగా నటిస్తున్న తాజాచిత్రం ‘పరమ్ సుందరి’. తుషార్ జలోటా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా.. ఉత్తరాది అబ్బాయి, దక్షిణాది అమ్మాయి ప్రేమకథతో రూపుదిద్దుకుంటోంది. దినేశ్ విజన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఇదే నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌లో జోరు పెంచింది.

ఇందులోభాగంగా ఈ సినిమా నుంచి శుక్రవారం ఓ రొమాంటిక్ గీతాన్ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ‘భీగి శారీ’ పేరుతో రిలీజ్ చేసిన ఈ పాట ఇప్పుడు సోషల్‌మీడియాను హీటెక్కిస్తోంది. సాంగ్ సీజన్‌కు తగ్గట్టుగా ఉందంటూ ఈ పాటను వింటూ యువత ఉర్రూతలూగుతోంది.

ఈ పాటలో నాయకానాయికల డ్యాన్స్ ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా జాన్వీ తడిసిన అందాలతో ఆకర్షిస్తోంది. ఈ వానపాటకు అమితాబ్ భట్టాచార్య అందించారు. సచిన్ సంగీత సారథ్యం వహిస్తూ అద్నాన్ సమీ, శ్రేయా ఘోషల్‌తో కలిసి పాడారు.