4 May, 2026 | 12:46 PM

Breaking News

బెంగాల్ బీజేపీదే.! భవానీ పూర్‌లో ఆధిక్యంలో మమతా బెనర్జీ   •   22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •  

గురుకుల విద్యార్థినికి ఉత్తమ పురస్కారం

07-08-2025 10:52 PM

అభినందించిన కలెక్టర్ ఆదర్శ్ సురభి..

కొత్తకోట: కొత్తకోట మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల విద్యార్థిని పల్లెపాగ సౌమ్యకు ఉత్తమ పురస్కారం లభించింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొత్తకోట గురుకుల పాఠశాలకు చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థిని సౌమ్య బుధవారం చేనేత కార్మిక అంశాలపై మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ఆమెను గురువారం అభినందించి పాఠశాల ఉపాధ్యాయురాలు, అధికారులతో కలిసి పురస్కారం అందజేశారు. గత కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ చేతుల మీదుగా కూడా పురస్కారం అందుకున్న పల్లెపాగ సౌమ్యను పలువురు అభినందిస్తున్నారు.