17 April, 2026 | 10:49 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఘనంగా భగీరథ మహర్షి జయంతి

05-05-2025 12:09 AM

మంచిర్యాల, మే 4, (విజయక్రాంతి) : భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఆదివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వ-ర్యంలో నిర్వహించిన భగీరథ మహర్షి జయంతి వేడుకలకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ సభావాత్ మోతిలాల్ భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తన ముత్తాతలకు స్వర్గ ప్రాప్తి లభించడానికి కఠోర తపస్సు చేసి దివి నుంచి గంగను భూమికి తీసుకువచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని అన్నారు. సగరుని మునిమనవడు అయిన భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగను భువికి తీసుకువచ్చాడని చరిత్ర చెబుతుందన్నారు.

సగరుని వంశస్థులు భవన నిర్మాణ పనులు చేపడతా-రని, ఉప్పు విక్రయదారులుగా, కార్మికులుగా ఉన్న వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. భవన నిర్మాణ రంగంలో శిక్షణ అందించి, అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. భగీరథ మహర్షి విగ్రహం ఏర్పాటు చేయాలని సగర కులస్తులు కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకు-వెళ్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రవుఫ్ ఖాన్, సాంఘిక సంక్షేమా-ధికారి రవీందర్ రెడ్డి, జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ ఈడి దుర్గాప్రసాద్, సంక్షేమ అధికారులు, భగీరథ వంశస్థులు, డిఆర్పిలు తదితరులు పాల్గొన్నారు.