1 July, 2026 | 6:35 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి

21-05-2025 12:00 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి టౌన్, మే 20 :  పైలెట్ ప్రాజెక్ట్ మండలంగా తీసుకున్న గోపాల్పేట మండలంలోని భూ భారతి దరఖాస్తులను జూన్ 2 లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తన ఛాంబర్ లో భూ భారతిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం పై సమీక్ష నిర్వహించారు.

వనపర్తి జిల్లాలో భూ భారతి చట్టం అమలును గోపాల్ పేట మండలాన్ని పైలట్ ప్రాజెక్టు గా తీసుకొని మే 5 నుండి 13 వరకు ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోగా మొత్తం 573 దరఖాసులు వచ్చాయి. అందులో 155 సెక్సేషన్, 131 సాదా బైనామా, పెండింగ్ మ్యుటేషన్, అసైన్మెంట్ మొదలగు దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటినీ జూన్ 2 లోగా పరిష్కరించాల్సి ఉందన్నారు. 

తహసిల్దార్ లాగిన్ లో పరిష్కారం అయ్యే వాటిని త్వరగా పరిష్కరించి ఆర్డీఓ లాగిన్ కు సంబంధించి, కలెక్టర్ ద్వారా పరిష్కరించాల్సినవి  కలెక్టర్ లాగిన్ కు పంపించాలని తహశీల్దార్లు ఆదేశించారు. జూన్ 2 నుంచి జిల్లాలోని అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో భూ భారతి చట్టం అమలు చేసేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహించాల్సి ఉంటుందని అందుకు తగిన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, ఆర్డిఓ సుబ్రహ్మణ్యం, గోపాల్పేట్ తహసిల్దార్ పాండు నాయక్, రాజు  సెక్షన్ సూపరిండెంట్ మదన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.