14 April, 2026 | 5:23 PM

Breaking News

జగన్నాధపురంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •  

రాజకీయ విరాళాల్లో బీజేపీ టాప్

23-12-2025 02:15 AM
  1. ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రూ.3,112 కోట్ల సేకరణ 
  2. మొత్తం రాజకీయ విరాళాల్లో 82% సొంతం చేసుకున్న బీజేపీ
  3. ఏపీ నుంచి వైస్సార్ సీపీ టాప్.. పార్టీ ఖాతాలో రూ.14౦ కోట్ల విరాళం
  4. తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్ ఖాతాలో రూ.15 కోట్ల ఫండ్

న్యూఢిల్లీ, డిసెంబర్ ౨౨: రాజకీయ విరాళాల్లో బీజేపీ రికార్డు సృష్టించింది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2024- -25 ఆర్థిక సం వత్సరంలో ఎలక్టోరల్ ట్రస్టుల మొత్తం విరాళాల్లో దాదాపు 82 శాతం నిధులు.. అంటే అక్షరాలా రూ.3,112 కోట్లను బీజేపీనే సొం తం చేసుకుంది. ఒక్క ‘ప్రూడెంట్’ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ నుంచే బీజేపీకి రూ.2,180 కోట్ల విరాళాలు అందడం గమనార్హం. అలాగే టాటా గ్రూప్ ‘ప్రోగ్రెసివ్ ట్రస్ట్’, మహీంద్రా గ్రూప్ ‘న్యూ డెమోక్రటిక్ ట్రస్ట్’కు సంబంధించిన సింహభాగం విరాళాలూ నుంచీ కూడా బీజే పీ ఖాతాలో జమ కావడం విశేషం.

సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసిన తర్వా త, కార్పొరేట్ సంస్థలు ఎలక్టోరల్ ట్రస్టుల వైపు మొగ్గు చూపాయి. దీంతో ట్రస్టుల ద్వారా అందిన నిధులు గతేడాదితో పోలిస్తే ఏకంగా మూడు రెట్లు పెరిగి.. రూ.3,811 కోట్లకు చేరుకున్నాయి. ఈ విరాళాల్లో ఒక్క బీజేపీనే రూ.3,112 కోట్లు సొంతం చేసుకోవడం విశేషం. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పా ర్టీ ఖాతాలో ఈసారి విరాళాలు తక్కువగానే జమయ్యాయి. ఆ పార్టీ రూ.298.77 కోట్ల మేర విరాళాలు అందాయి.

ఈ రెండు పార్టీ లు కాక, మిగతా రాజకీయ పార్టీలన్నీ కలిపి సుమారు రూ.400 కోట్ల మేర విరాళాలు పొందాయి. ఇక తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీల విషయానికొస్తే.. తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్ రూ.15 కోట్ల మేర విరాళాలు పొం దింది. ఏపీలోని వైఎస్సార్ సీపీ సుమారు రూ.140 కోట్ల విరాళాలు పొంది అగ్రస్థానంలో ఉంది. టీడీపీ రూ.౮౩ కోట్లు, జనసేన రూ.25 కోట్ల విరాళాలు పొందాయి.