15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మేక నుంచి మేకపోతుకి రక్త మార్పిడి

22-11-2025 12:00 AM

 ప్రాంతీయ పశువైద్యశాల కోదాడలో అరుదైన చికిత్స 

కోదాడ, నవంబర్;  పట్టణానికి చెందిన బసనబోయిన పున్నయ్య మేకపోతుకి  విపరీతంగా గోమార్లు పట్టి రక్తం తాగడంతో గురువారం రాత్రి అకస్మాత్తుగా కింద పడిపోయింది. రాత్రి ఎనిమిది గంటలకు హుటాహుటిన ప్రాంతీయ పశువైద్యశాల కోదాడకు తీసుకురాగా పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య  మేకపోతు కళ్లు పూర్తిగా పాలిపోయి తెల్లగా మారడం తో రక్తహీనతగా గుర్తించారు.

రక్తానికి సంబంధించిన ప్లాస్మాని రక్తంలోకి ఎక్కించగా కొద్దిగా తేరుకున్న పోతు పూర్తిస్థాయిలో కోలుకోవాలంటే తప్పనిసరిగా రక్తం ఎక్కించాల్సిందేనని వైద్యాధికారి గుర్తించారు. అయితే వేరే మేక రక్తం ఎక్కించడానికి  రక్తం సంచులు అందుబాటులో లేవు. దీంతో శుక్రవారం ఉదయం   అందుబాటులో ఉన్న వనరులతోనే  రైతు వద్ద ఉన్న ఇతర మేకల్లోనీ మూడు మేకల రక్తం తీసి నేరుగా మేకపోతుకు మార్పిడి చేశారు. దీంతో మేకపోతు ఆరోగ్యం కొంతమేర  కుదుటపడినట్లు వైద్యాధికారి పెంటయ్య తెలిపారు. ఈ చికిత్సలో సిబ్బంది రాజు, చంద్రకళ, అఖిల్.  కరుణ్ లు పాల్గొన్నారు.