9 April, 2026 | 10:25 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

అఫిడవిట్లు దాఖలు చేయండి

29-01-2026 01:04 AM

హెచ్‌సీఏకు బాంబే హైకోర్టు ఆదేశం

టీసీఏ సభ్యత్వ వివాద పరిష్కారం కేసు

ముంబై, జనవరి 28 : బీసీసీఐ జారీ చేసి న దీర్ఘకాలిక ఆదేశాల అమలు కోరుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసిషన్‌పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు విచారించింది. తెలం గాణలో క్రికెట్‌కు సంబంధించి టీసీఏ నుంచి విలువైన సలహాలు, సూచనలు తీసుకుని కలిసి పనిచేయాలంటూ బీసీసీఐ ఆదేశాలను హెచ్‌సీఏ పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అలాగే కోర్టు ఆదేశాలను సైతం అమలు చేయడం లేదని టీసీఏ తరపు న్యాయవాది వివేక్ కాంతవాలా కోర్టు కు తెలియజేశారు. గత ఏడాది మార్చి 29న జరిగిన సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను పది నెలలుగా హెచ్‌సీఏ అందించ లేదని తెలిపారు. అలాగే తర్వాతి చర్యల కో సం టీసీఏ పంపించిన అనేక లేఖలకు సైతం ఎలాంటి స్పందన లేదన్నారు. 

టీసీఏకు అనుకూలంగా బీసీసీఐ తరపున ఆదేశాలు జారీ అయినా హెచ్‌సీఏ అమలు చేయకపోవడంతో పదే పదే న్యాయస్థానాలను ఆశ్ర యించాల్సి వస్తోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.హెచ్‌సీఏ నిరంతర నిర్లక్ష్యం, అవిధే యత దృష్ట్యా పిటిషన్‌ను స్వీకరించి టీసీఏకు బీసీసీఐలో అసోసియేట్ సభ్యత్వం ఇన్నాలని కోర్టును కోరారు. అన్ని వాదనలు పరిశీ లించిన అనంతరం చివరి నాలుగు వారాల గడువు ఇస్తూ సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని కోర్టు ఆదేశించింది. మార్చి 9కి ఒక వారం ముంగు రెండు పక్షాలు తమ తమ అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించింది. ఆ తర్వాత కేసుపై తుది నిర్ణయం తీసుకుంటామనిస ఆదేశాలను పాటించని పక్షంలో బీసీసీఐకి ఆదేశాలు ఇవ్వడం లేదా తుది ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది.