13-10-2025 12:04:16 AM
హైదరాబాద్ డాక్టర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలోని ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి సమా వేశ మందిరంలో ఈ నెల 17న (శుక్రవారం) ‘జీవగడ్డ’ సంస్థ ఆధ్వర్యంలో కవి అన్నవరం దేవేందర్ ‘అట్లనే’ కవితా సంకలన ఆవిష్కరణ సభ జరుగనున్నది. పుస్తకాన్ని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఘంటా చక్రపాణి ఆవిష్కరించనున్నారు. ముఖ్యఅతిథులుగా సీనియర్ సంపాదకులు కే శ్రీనివాస్, అల్లం నారాయణ విచ్చేయనున్నారు. సభకు ఆచా ర్య రజనీ నెల్లుట్ల అధ్యక్షత వహించనున్నారు.