calender_icon.png 23 August, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియన్ నేవికి ఎంపికైన బోథ్ యువకుడు

22-08-2025 11:53:56 PM

బోథ్,(విజయక్రాంతి): బోథ్ పట్టణంలోని సాయి నగర్ కు చెందిన కొప్పుల ప్రణీత్ ఇండియన్ నేవీ కి ఎన్నికయ్యాడు. ఇటీవల హైదరాబాదులో జరిగిన ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి నేవీలోని ఎస్ఆర్ఆర్ విభాగానికి ఎంపికైనట్లు తెలిపారు. కొప్పుల రాములు -కవిత  దంపతుల కుమారుడైన ప్రణీత్  చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేవాడు. నేవికి ఎంపికైన ప్రణీత్ ను తల్లిదండ్రులు గ్రామస్తులు అభినందించారు.