20 March, 2026 | 6:12 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

తెలంగాణలో ఎమ్మెల్యేలకే మాట్లాడే హక్కు లేకుండా పోయింది

05-12-2024 10:49 PM

సంవత్సరకాలంలో ఇన్ని నిబంధనలు, నిర్బంధాలా

మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్

 కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ నిరసన

కరీంనగర్,(విజయక్రాంతి): పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్టంలో ఎమ్మెల్యేలకు మాట్లాడే హక్కు లేకుండా పోయిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిల అరెస్టుకు నిరసనగా బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన సంవత్సరకాలంలోనే ఇన్ని నిబంధనలు, ఇన్ని నిర్బంధాలా అని ప్రశ్నించారు. ఏనాడు ఇన్ని నిర్బంధాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఎమ్మెల్యేలకు మాట్లాడే హక్కు ఉందని, వారిని అరెస్టులు చేయడం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులపై దృష్టి పెడితే జైళ్లు సరిపోవని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టుల మీద కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.