26-07-2025 09:56:07 PM
తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ, సంతాయిపేట గ్రామాలకు చెందిన 40 మంది నాయకులు, కార్యకర్తలు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు సమక్షంలో వారు హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగిపోతుందని తెలిపారు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత కరెంటు సౌకర్యం, పేదవారికి రేషన్ కార్డుల పంపిణీ తదితర కార్యక్రమాలు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.