27-01-2026 01:02:54 AM
శామీర్ పేట్ , జనవరి 26 ( విజయ క్రాంతి): మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కేశవరం లో సోమవారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని చామకూర భద్ర రెడ్డి ప్రారంభించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను గడపగడపకు తీసుకెళ్లాలి అన్నారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలరాజ్ గౌడ్, హరి మోహన్ రెడ్డి, శ్రీనివాస్యాదవ్, సుభాష్ గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.