8 June, 2026 | 6:21 PM

Breaking News

ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •   పగలైనా.. రాత్రైనా.. విద్యుత్ సమస్యలపై యోధుడిలా పోరాడే ‘కరెంట్ దేవుడు’ నరసింహ   •  

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేది బీఆర్ఎస్

25-10-2025 03:01 PM

తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

తుంగతుర్తి,(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్(Maganti Sunita Gopinath) మద్దతుగా బోరబండ డివిజన్లోని క్లస్టర్-1 రాజ్ నగర్ కాలనీలోని 357,358,359,360,361బూత్ లలో బిఆర్ఎస్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాయమాటలను నమ్మరని తెలిపారు. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి హామీలన్నీ వట్టి మూటలు అని ఎద్దేవా చేశారు. మాగంటి సునీత గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు , నేవూరి ధర్మేందర్ రెడ్డి మాజీ జెడ్పిటిసి  వెంకన్న, స్థానిక నాయకులు, తుంగతుర్తి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.