22 May, 2026 | 11:45 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

అందరూ మెచ్చేలా రోడ్డు వేయండి

10-09-2025 09:00 PM

సిసి రోడ్డు నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): అందరు మెచ్చేలా నాణ్యతగా సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) స్పష్టం చేశారు. బుధవారం నగరంలోని టిడి గుట్ట నుంచి కొత్త చెరువు రోడ్ వరకు 35 లక్షల రూపాయల ముడా నిధులతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్ నిర్మాణపు పనులకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని ప్రతి డివిజన్ లలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ బాగు చేస్తున్నామని తెలిపారు.  గత పది సంవత్సరాలుగా మహబూబ్ నగర్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ పి వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు సాదుల్లా, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు  మహమ్మద్ మునీర్ , చిన్న, ఖాజా పాషా , రాషెద్ ఖాన్, ప్రశాంత్ , శ్రీను, నాయకులు ఫక్రు, తదితరులు పాల్గొన్నారు.