4 April, 2026 | 2:01 PM

Breaking News

క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •   నాటు సారా తాగి ముగ్గురు మృతి — సారా వల్లే మరణించారా ?   •   పురుగుమందు డబ్బాలతో రైతుల ఆందోళన   •  

యువత స్వయం ఉపాధి రంగాలలో రాణించాలి

03-10-2025 10:26 PM

టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి

హుజూర్ నగర్,(విజయక్రాంతి): యువత స్వయం ఉపాధి కల్పించుకొని వ్యాపార రంగాలలో రాణించి పది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. శుక్రవారం వేపల సింగారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బుజ్జమ్మ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించి మాట్లాడారు.

యువతి యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి కల్పించుకొని వారి కాళ్లపై వారు నిలబడి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు అవకాశం కల్పిస్తున్నారని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.పిల్లింగ్ స్టేషన్ యాజమాన్యం అత్యంత నమ్మకంతో వాహనదారులకు సేవలు నాణ్యమైన అందించాలన్నారు.