17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

వీల్ చైర్‌లో దివ్యాంగురాలి ప్రచారం

11-12-2025 12:00 AM

మోతే, డిసెంబర్ 10 (విజయ క్రాంతి):-  మోతె  గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా  పల్లెల వనిత ఓటు కోసం వీల్ చైర్ లో ప్రచారం నిర్వహించడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేస్తున్న వనితకు భారత వికలాంగుల హక్కుల పరి రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 న గ్రామంలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో పల్లెల వనిత డిగ్రీ వరకు చదువు కొని ప్రజా సేవ చేయడానికి ముందుకు వచ్చిన పల్లెల వనిత కు మీ అమూల్యమైన ఓటు వేయాలని గ్రామ ఓటర్లను అభ్య ర్ధించారు.

పంచాయతీ ఎన్నికలు డబ్బు మద్యం మాంసం చుట్టు తిరుగుతున్నాయని మండి పడ్డారు. ప్రజలు చాల చైతన్య వంతం కలిగిన వారని గ్రామంలో పని చేసే వారు   ఎవరు అనే విషయం ప్రతి ఓటరుకు గుర్తు ఉన్నదని చెప్పారు. 

ఉన్నత విద్యను అభ్యసించిన పల్లెల వనిత ను గెలిపిస్తే అభివృద్ధికి బాటలు వేస్తామని తెలిపారు. విద్యార్థులు మేధావులు రైతులు మహిళలు ఆలోసించి ఓటును వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి పల్లెల వనిత, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి జంజిరాల సుధాకర్, బొల్లం లింగయ్య యాదవ్, తురక నాగమ్మ, జిల్లేపల్లి శివ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.