17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సెంచరీతో చెలరేగిన కెప్టెన్ శుభ్‌మాన్ గిల్

02-07-2025 11:35 PM

ఇండియా vs ఇంగ్లాండ్: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌(Edgbaston)లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఆటలో భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్(Shubman Gill) మరోసారి అద్భుతమైన శతకాన్ని సాధించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి రోజు ఆటలో 85 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది, కెప్టెన్ గిల్ సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు. వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) కూడా హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. కెప్టెన్‌గా మొదటి రెండు టెస్ట్‌లలో సెంచరీలు చేసిన నాల్గవ భారత టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్ నిలిచాడు. దీంతో విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్‌ సరసన జాబితాలో చేరాడు. యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) కూడా తన అద్భుతమైన ఇన్నింగ్స్(87)ని ప్రారంభించి, సెంచరీని తృటిలో కోల్పోయాడు.