15 June, 2026 | 11:28 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

దీపావళి టపాసులు అక్రమ వ్యాపారిపై కేసు నమోదు

18-10-2025 07:55 PM

- ఎటువంటి అనుమతి పత్రాలు లేవు

- మంగపేట ఎస్సై టివిఆర్ సూరి

మంగపేట,(విజయక్రాంతి): మంగపేట మండల కేంద్రంలో ఎవరైనా దీపావళి (బాంబులు) పటాసుల వ్యాపారాలు కొనసాగించాలంటే ప్రభుత్వం, సంబంధిత అధికారుల నుండి అనుమతి పత్రాలు పొంది వ్యాపారం చేసుకోవచ్చని పోలీసు వారు ఇదివరకే ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు భిన్నంగా కమలాపురం గ్రామానికి చెందిన తాటిపల్లి రాజేందర్ ఎలాంటి అనుమతి పత్రాలు తీసుకోకుండా ఆంధ్రాలోని చిలకలూరిపేట నుండి దీపావళి పటాసులు అక్రమంగా కొనుగోలు చేసి జనావాసాల మధ్య నిల్వ ఉంచారు.

కమలాపురంలో శుక్రవారం సాయంత్రం పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా తాటి రాజేందర్ ఇంటిలో సుమారు 1,89,265/- విలువచేసే దీపావళి పటాసులను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. దీపావళి పటాసుల అక్రమ వ్యాపారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై టివిఆర్ సూరి మాట్లాడుతూ మండలంలో అనుమతి లేకుండా దీపావళి పటాసులను అమ్మిన నిలువ ఉంచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.